పంకజా ముండేకు ప్రమోషన్... జాతీయ రాజకీయాల్లోకి ముండే!

ABN , First Publish Date - 2020-07-04T01:41:23+05:30 IST

ఇన్ని రోజుల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా వెలుగొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న

పంకజా ముండేకు ప్రమోషన్... జాతీయ రాజకీయాల్లోకి ముండే!

ముంబై : ఇన్ని రోజుల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా వెలుగొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న పంకజా ముండేకు రాజకీయ ప్రమోషన్ లభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ శుక్రవారం మహారాష్ట్ర బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అయితే పంకజా ముండేకు జాతీయ రాజకీయాల్లో పోస్ట్ లభించనుందని ఆయన ప్రకటించారు.


ఆ జాతీయ పదవితో పాటు రాష్ట్ర కమిటీ కోర్ కమిటీలో కూడా ఉంటారని ఆయన తెలిపారు. చాలా రోజుల కాలంగా నూతన కార్యవర్గం పెండింగ్‌లో ఉండిపోయింది. నూతన కార్యవర్గంలో 68 మంది కార్యవర్గ సభ్యులు, 12 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులతో పాటు 12 మంది కార్యదర్శులుంటారని ఆయన తెలిపారు. ‘‘తొందర్లోనే పంకజా ముండేకు జాతీయ రాజకీయాల్లో ఓ పదవి లభించబోతోంది. దాంతో పాటు రాష్ట్ర కోర్ కమిటీలో కూడా కొనసాగుతారు’’ అని చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. 

Updated Date - 2020-07-04T01:41:23+05:30 IST