పల్నాడు జిల్లా.. పిడుగురాళ్లలో అరాచకం
ABN , First Publish Date - 2022-04-26T21:34:31+05:30 IST
పల్నాడు జిల్లా: ఏపీలో వైసీపీ నేతల అధికార అరాచకానికి అడ్డే లేకుండా పోతోంది.
పల్నాడు జిల్లా: ఏపీలో వైసీపీ నేతల అధికార అరాచకానికి అడ్డే లేకుండా పోతోంది. దీనికి పోలీసుల జులుం కూడా తోడవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఫ్లెక్సీలను చించారంటూ చిన్నారులను ఐదు గంటలపాటు పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టిన ఘటన తీవ్ర కలకలంరేపుతోంది.
పిడుగురాళ్లలో పదేళ్లలోపు చిన్నారులను పోలీస్ స్టేషన్లో ఉంచిన ఘటన వివాదాస్పదమవుతోంది. ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీలను చించారని వైసీపీ నేతలు ఆరోపించారు. జానపాడు గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే రాక సందర్భంగా ఈ ఘటన జరిగింది. వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు చిన్నారులను పీఎస్కు తీసుకువెళ్లారు. ఐదు గంటలపాటు చిన్నారులను పీఎస్లోనే కూర్చోబెట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలు పీఎస్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపారు. చివరికి స్థానిక టీడీపీ నాయకులు పూచీకత్తుతో పిల్లలను ఇంటికి పంపించారు. పోలీసులు తీరుపై స్థానికులు, ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.