అమ్మా.. మీరంతా నిద్రపోయాక రాత్రిళ్లు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా..? అంటూ ఆ 9 ఏళ్ల బాలిక చెప్పింది విని..
ABN , First Publish Date - 2021-11-25T18:05:57+05:30 IST
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వ్యక్తే ఆ చిన్నారిపై కన్నేశాడు.. అభం శుభం తెలియని బాలికను లోబరుచుకున్నాడు..
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వ్యక్తే ఆ చిన్నారిపై కన్నేశాడు.. అభం శుభం తెలియని బాలికను లోబరుచుకున్నాడు.. భార్య నిద్రపోయినపుడు ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. సవతి కూతురికి నరకం చూపించాడు.. కేసును విచారించిన కోర్టు అతనికి తగిన శిక్షను విధించింది.. 20 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.. రాజస్థాన్లోని పాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
గతేడాది డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక తొమ్మిదేళ్ల సవతి కూతురిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను, అమ్మను చంపేస్తానని కత్తి చూపించి బెదిరించాడు. భయపడిన బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తర్వాతి రోజు ఉదయం తన కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి విషయం ఏంటని ఆరా తీసింది. చాలా సేపు బుజ్జగించి అడిగిన తర్వాత ఆ బాలిక అసలు విషయం బయటపెట్టడింది. `నాన్న నన్ను ఏదో చేశాడ`ని చెప్పింది.
విషయం గ్రహించిన బాధిత బాలిక తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మొదటి భర్త నుంచి విడిపోయి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భర్త.. సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఏడాది పాటు విచారణ అనంతరం పాలి కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. అలాగే రూ.35 వేలు జరిమానా కూడా విధించింది.