పాలమూరు వైస్‌ చాన్స్‌లర్‌గా లక్ష్మీకాంత్‌ రాథోడ్‌

ABN , First Publish Date - 2021-05-22T05:40:22+05:30 IST

పాలమూరు యూని వర్సిటీ వైస్‌ చాన్స్‌ల ర్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ను శుక్రవారం నియ మించింది

పాలమూరు వైస్‌ చాన్స్‌లర్‌గా  లక్ష్మీకాంత్‌ రాథోడ్‌

పాలమూరు యూ నివర్సిటీ, మే 21 : పాలమూరు యూని వర్సిటీ వైస్‌ చాన్స్‌ల ర్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ను శుక్రవారం నియ మించింది. ఈ మేర కు గవవర్నర్‌ తమిళ సై యూనివర్సిటీల చాన్స్‌లర్‌ నియామక ఫైల్‌పై సంతకం చేసి వీసీలను ప్రకటించా రు. మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి లక్ష్మీ కాం త్‌ రాథోడ్‌ను వీసీగా నియమించారు. ఈయన ఇప్పటి వరకు నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్‌ డైరెక్టర్‌ డీన్‌గా వ్యవహ రించారు. పాలమూరు జిల్లా నుం చి మొట్టమొటసారిగా వీసీ అయిన వ్యక్తి లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పీయూకు ఎన్నికవడం గమనార్హం. ఫిజికల్‌ డైరెక్టర్‌గా చేసి వీసీగా నియమితు లవడం కూడా మొదటిసారి. నూతన వీసీ నియామకంపై పీయూ ప్రొఫెసర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-22T05:40:22+05:30 IST