ఏలూరు: ప్రభుత్వం పేదలపై పగబట్టిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కాసుల కోసం పేదల గూటిపై దండయాత్ర చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం కాదు.. జగనన్న పైసా వసూళ్ల పథకం అని అన్నారు. రూపాయి కూడా సాయం చేయని జగన్ ప్రభుత్వం ఎప్పుడో నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు.