అగ్నిప్రమాద బాధితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2021-10-20T05:31:29+05:30 IST
మండలంలోని శేమునాపల్లిలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
చోడవరం, అక్టోబరు 19: మండలంలోని శేమునాపల్లిలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన బాధిత కామాక జయరాజ్, కరుణకుమార్ల కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించి నిత్యావసర సరకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెదబాబు, తె లుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డేడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు చోడవరం అంబేడ్కర్ ట్రస్ట్ సభ్యులు నడుపూరి దేముడు, వేచలపు ప్రకాశ్, వరప్రసాద్, వెంకటరావు, జడ్పీటీ సీమాజీ సభ్యుడు బొడ్డేడ సూర్యనారాయణ, సర్పంచ్ ఉరుకుడి భోగేష్ తదితరులు... నెల రోజులకు సరిపడ నిత్యావసర సరకులను అందచేశారు.