పాక్ ఆర్మీ కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం

ABN , First Publish Date - 2020-06-11T15:21:06+05:30 IST

పాకిస్థాన్ ఆర్మీ కాల్పులను భారతసైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు....

పాక్ ఆర్మీ కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం

సైనికుడి మృతి

ఓ పౌరుడికి గాయాలు...ఆసుపత్రికి తరలింపు

రాజౌరీ, ఫూంచ్ (జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ ఆర్మీ కాల్పులను భారతసైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు. జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లా రాజౌరీ, ఫూంచ్ సెక్టార్లలో సరిహద్దుల్లో బుధవారం రాత్రి పాక్ సైనికులు తుపాకులు, షెల్లింగులు, మోర్టార్లతో కాల్పులు జరిపారు. దీంతో భారతసైనికులు ఎదురుకాల్పులు జరిపారు. పాక్ కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు.ఈ కాల్పుల్లో భారత సైనికుడొకరు అమరుడయ్యారు. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్ సరిహద్దుల్లో తరచూ కాల్పులకు తెగబడుతోంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ సైనికులు నౌషెరా సెక్టారులో పౌరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాజౌరీ జిల్లా మంజాకోటి సెక్టారులోని ఓ పౌరుడు గాయపడ్డారు. పౌరుడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతని కుడి భుజంలోనుంచి షెల్ ను వెలికితీశారు. గాయపడిన పౌరుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని సైనికులు చెప్పారు. 

Updated Date - 2020-06-11T15:21:06+05:30 IST