పాకిస్తాన్‌లో 85వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-05T01:56:08+05:30 IST

దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా కేసులు 85వేలు దాటాయి. దీంతో కరోనా కేసుల్లో చైనాను...

పాకిస్తాన్‌లో 85వేలు దాటిన కరోనా కేసులు

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా కేసులు 85వేలు దాటాయి. దీంతో కరోనా కేసుల్లో చైనాను పాకిస్తాన్ దాటేసింది. గత 24 గంటల్లో నమోదైన 4,688 కోవిడ్-19 కేసులతో కలుపుకొని దేశంలోని మొత్తం బాధితుల సంఖ్య ప్రస్తుతం 85,264కి చేరింది. దీంతో 84,165 కోవిడ్-19 పాజిటివ్ కేసులతో ఉన్న చైనాను పాకిస్తాన్ ఈ రోజు అధికమించింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాకుండా గత 24 గంటల్లో 82 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,770కి చేరిందని తెలిపింది. ఇదిలా ఉంటే మొత్తం బాధితుల్లో ఇప్పటిరకు 30 వేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T01:56:08+05:30 IST