నా భర్త Ayyanna తప్పుగా ఏం మాట్లాడలేదు: Padmavati
ABN , First Publish Date - 2022-06-20T18:35:36+05:30 IST
ప్రభుత్వం కక్షసాధింపులను ఖండిస్తున్నామని అయ్యన్న సతీమణి పద్మావతి అన్నారు.
Narsipatnam (అనకాపల్లి జిల్లా): ప్రభుత్వం కక్షసాధింపులను ఖండిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) సతీమణి పద్మావతి (Padmavati) అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అయ్యన్న తప్పుగా ఏం మాట్లాడలేదని, మంత్రి రోజా (Roja) వ్యాఖ్యలకు కౌంటర్ మాత్రమే ఇచ్చారన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా గోడ కూల్చారని, ఈ ఘటనకు పాల్పడిన అధికారులను కోర్టుకు ఈడుస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారులంటే గౌరవం ఉండాలి.. భయం కాదన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారని పద్మావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తమ కుటుంబం ఎవరికి ఏం అన్యాయం చేసిందని పద్మావతి ప్రశ్నించారు. ‘‘ఎవరినైనా హత్య చేసిందా? గోడ కూల్చే ముందే నోటీసు ఇవ్వాలి కదా. గోడ కొట్టిన తర్వాత సర్వే చేయడమేంటి. మహానాడులో ప్రజల కోసం అయ్యన్న గళమెత్తినందుకు ఇల్లు కూల్చేస్తారా?. అయ్యన్న గొంతు నొక్కాలని చూస్తున్నారు. సమాజంలో మాట్లాడే హక్కు కూడా లేదా? ప్రజల గురించి మాట్లాడితే తప్పేంటి. బీసీ నాయకుడి కుటుంబం రోడ్డున పడాలని అనుకుంటున్నారా?.. రాష్ట్రంలో అందరినీ చంపేస్తున్నారు. అయ్యన్నపాత్రుడి కుటుంబాన్ని చంపేస్తారా? జగన్ చేస్తున్నది ముమ్మాటికీ తప్పే. 40 ఏళ్ల రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూడలేదు’’ అని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.