రోడ్డుపై వరి నాట్లు
ABN , First Publish Date - 2022-08-07T06:29:48+05:30 IST
అధ్వాన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు చెప్పలేనివని, రోడ్లు కాల్వలను తలపిస్తున్నా యని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్ అన్నారు.
విస్సన్నపేట, ఆగస్టు 6 : అధ్వాన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు చెప్పలేనివని, రోడ్లు కాల్వలను తలపిస్తున్నా యని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్ అన్నారు. పుట్రేల మెయిన్ రోడ్డులో మారెమ్మ గుడి వద్ద పడిన పెద్ద పెద్ద గోతుల్లో శనివారం నాట్లు వేసి నిర సన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీడీపీ అనుకూల కుటుం బాలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తుందన్నారు. అనంతరం పుట్రేలలో టీడీపీ నాయకు లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 13 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తామన్నారు. ఆనంద్ స్వరూప్, రాజేష్కన్నా, నాగుల్ మీరా, దొడ్డ కృష్ణా రెడ్డి, బొడ్డు మారేశ్వరరావు, దార్ల హరీష్, కొండా భాస్కరరావు, దార్ల రాజేష్, కొక్కిలిగడ్డ శేఖర్, కనపర్తి రవీంద్ర, గొల్లమూడి రమేష్ పాల్గొన్నారు.