సీహెచ్సీకి ఆక్సిజన్ సరఫరా మీటర్లు అందజేత
ABN , First Publish Date - 2021-05-16T07:46:07+05:30 IST
కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు 5 ఆక్సిజన్ సరఫరా మీటర్లను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వైసీపీ నాయకులు అందజేశారు.
దర్శి, మే 15 : కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు 5 ఆక్సిజన్ సరఫరా మీటర్లను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వైసీపీ నాయకులు అందజేశారు. సుమారు రూ.40 వేలు విలువైన ఆక్సిజన్ ప్లోమీటర్లను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కె.అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఇడమకంటి వేణుగోపాల్, సొసైటీ డైరెక్టర్ పూసల చిన్నయ్య నాయకులు వై.వీ.సుబ్బయ్య, ఎం.పుల్లారెడ్డిలు వైద్యాధికారి డాక్టర్ ఆనంద్బాబుకు అందజేశారు. ఇప్పటివరకు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నా సరిపడా ప్లోమీటర్లు లేకపోవటంతో వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సహకారం అందించినట్లు తెలిపారు. ప్లోమీటర్లు అందుబాటులోకి రావడంతో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించే వీలు ఉంటుందని వైద్యాధికారులు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీడీబీ వరకుమార్, నగర పంచాయతీ కమిషనర్ ఆవుల సుధాకర్, ఆర్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.