ఐక్య ఉద్యమాలతో విజయం సొంతం
ABN , First Publish Date - 2022-05-29T06:09:39+05:30 IST
ఐక్య ఉద్యమాల ద్వారానే విజయం మన సొంతమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలి వద్ద ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 471వరోజు కొనసాగాయి
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, మే 28: ఐక్య ఉద్యమాల ద్వారానే విజయం మన సొంతమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలి వద్ద ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 471వరోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో ఎంఎంఎస్ఎం, ఎస్పీఎం, ఎస్టీఎం, డబ్ల్యూఆర్ఎం కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని మరింత బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే ఉంటుందన్నారు. కార్మిక సంఘాల నాయకులు కేఎస్ఎన్ రావు, వేములపాటి ప్రసాద్, గంగవరం గోపి, జి.ఆనంద్, నరేంద్ర, రాజాబాబు, దేముడు, రమేశ్, మహ్మద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.