వెల్లివిరిసిన దేశభక్తి
ABN , First Publish Date - 2022-08-13T05:26:15+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శుక్రవారం చీపురుపల్లిలో 300 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. వందలాది మంది విద్యార్థులతో చేపట్టిన ర్యాలీ తొలుత మెయిన్ రోడ్డు మీదుగా ప్రారంభమైంది. సిటీ కేబుల్ కార్యాలయం వరకూ కొనసా
చీపురుపల్లి, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శుక్రవారం చీపురుపల్లిలో 300 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. వందలాది మంది విద్యార్థులతో చేపట్టిన ర్యాలీ తొలుత మెయిన్ రోడ్డు మీదుగా ప్రారంభమైంది. సిటీ కేబుల్ కార్యాలయం వరకూ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఆర్డీఓ ఎం. అప్పారావు, తహసీల్దారు సురేష్, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు.