ఆవ నూనెలో ఇక వాటిని కలపొద్దు.. : ఎఫ్ఎస్ఎస్ఏఐ

ABN , First Publish Date - 2020-09-25T21:31:08+05:30 IST

ఆవ నూనెతో కలిపి ఇకపై మిశ్రమ వెజిటబుల్ నూనె తయారు చేయరాదంటూ భారత ..

ఆవ నూనెలో ఇక వాటిని కలపొద్దు.. : ఎఫ్ఎస్ఎస్ఏఐ

న్యూఢిల్లీ: ఆవ నూనెతో కలిపి ఇకపై మిశ్రమ వెజిటబుల్ నూనె తయారు చేయరాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్థం శుద్ధమైన ఆవ నూనెను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఇప్పటి వరకు ఆవ నూనెలో 20 శాతం ఇతర వంట నూనెలను కలిపేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉంది. 

Updated Date - 2020-09-25T21:31:08+05:30 IST