ఎంవీపీ రైతుబజార్లో సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లు
ABN , First Publish Date - 2022-06-30T06:04:45+05:30 IST
ఎంవీపీ రైతుబజార్లో సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటుచేస్తామని రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం రైతుబజార్ను పరిశీలించిన ఆయన కంటైనర్ మోడల్లో పైలట్ ప్రాజెక్టుగా పదిహేను రోజుల్లో ఆరు నుంచి ఏడు స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎంవీపీ కాలనీ, జూన్ 29: ఎంవీపీ రైతుబజార్లో సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటుచేస్తామని రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం రైతుబజార్ను పరిశీలించిన ఆయన కంటైనర్ మోడల్లో పైలట్ ప్రాజెక్టుగా పదిహేను రోజుల్లో ఆరు నుంచి ఏడు స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీతమ్మధార రైతుబజారులోనూ సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబజార్ల ఇన్చార్జి పాపారావు, మార్కెటింగ్ శాఖ డీఈ కెనడీ, పలువురు ఆర్గానిక్ రైతులు పాల్గొన్నారు.