పంట నమోదుకు అవకాశం
ABN , First Publish Date - 2020-08-04T11:14:28+05:30 IST
ఖరీఫ్లో పంటలు సాగుచేసిన రైతులు తప్పనిసరిగా ఈ నెల 31 లోపు పైర్లు వివరాలను ఈ-కర్షక్ యాప్లో నమోదు..
మార్టూరు ఆగస్టు 3 : ఖరీఫ్లో పంటలు సాగుచేసిన రైతులు తప్పనిసరిగా ఈ నెల 31 లోపు పైర్లు వివరాలను ఈ-కర్షక్ యాప్లో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి వి కిరణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కోనంకి గ్రామంలో సోమవారం రైతులకు సాగుదారు పత్రాలు మంజూరుపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఏఏ పవిత్ర, వీఆర్వో ముసలయ్య, ఉప్పలపాటి కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.