మళ్లీ తెరపైకి ‘ఆపరేషన్ కమల’!
ABN , First Publish Date - 2021-06-23T08:52:36+05:30 IST
కర్ణాటకలో ‘ఆపరేషన్ కమల’ మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.10 కోట్లకు డీల్ కుదిరిన వ్యవహారంపై ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా..
బెంగళూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ‘ఆపరేషన్ కమల’ మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.10 కోట్లకు డీల్ కుదిరిన వ్యవహారంపై ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా విచారణ జరిపేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. యాదగిరి జిల్లా గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కందకూర్ బీజేపీలో చేరే విషయమై ఈ డీల్ జరిగింది. ఎమ్మెల్యే నాగనగౌడతో కాకుండా ఆయన కుమారుడు శరణగౌడతో డీల్కు ప్రయత్నించిన వివాదాన్ని విచారించేందుకు హైకోర్టు బెంచ్ మంగళవారం అనుమతులిచ్చింది.