రక్షణావసరాలను తెలిపేందుకు ఆన్లైన్ పోర్టల్
ABN , First Publish Date - 2020-08-15T08:32:16+05:30 IST
రక్షణ శాఖ అవసరాలను ప్రైవేటు సంస్థలు తెలుసుకునేందుకు గాను ‘శ్రీజన్’ అనే ఆన్లైన్ పోర్టల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు...
- ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్, ఆగస్టు 14: రక్షణ శాఖ అవసరాలను ప్రైవేటు సంస్థలు తెలుసుకునేందుకు గాను ‘శ్రీజన్’ అనే ఆన్లైన్ పోర్టల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు(డీపీఎ్సయూ), సాయుధ బలగాల ప్రధాన కార్యాలయాలు తాము దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఈ పోర్టల్లో ప్రదర్శిస్తాయని, తద్వారా దేశీయ సంస్థలకు ఏ ఉత్పత్తులు రూపొందించాలన్నదానిపై అవగాహన వస్తుందని ఆయన వివరించారు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్(యూఏవీ)లను అభివృద్ధి పరిచేందుకై బీఈఎంఎల్, ఐఐటీ కాన్పూర్ మధ్య ఒప్పందం(ఎంవోయూ), కృత్రిమ మేధ, కంప్యుటేషన్ తదితర రంగాల విషయంలో గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో ఐఐటీ గోవా ఎంవోయూలు కుదిరాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జూన్ 15న చోటుచేసుకున్న సైనిక ఘర్షణకు కారకుల్ని గుర్తించి శిక్షించాలంటూ చైనా తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం ప్రతి నెలా ప్రచురించే చైనా-ఇండియా రివ్యూ అనే పత్రికలో కథనాన్ని ప్రచురించింది. భారత్ తన బలగాలను క్రమశిక్షణలో ఉంచుకోవాలని, గల్వాన్ లోయ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చైనా సలహా ఇచ్చింది.