కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-04T09:57:16+05:30 IST

యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. లాక్‌డౌన్‌ నిబంధనలు

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

భువనగిరి టౌన్‌/వలిగొండ, ఏప్రిల్‌3: యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.  లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. పట్టణ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌, ఎస్‌ఐలు అంజయ్య, వినోద్‌, ట్రాఫిక్‌ సీఐ సతీష్‌ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. కాగా  ఈనెల 5న బాబు జగ్జీవన్‌రామ్‌, 14న డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సజ్జన్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిమిత సంఖ్యలోనే జయంతి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. వలిగొండ, వర్కట్‌పల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలకు 21రోజుల స్వీయ నిర్బంధం పూర్తయిన సందర్భంగా  సర్టిఫికెట్లు అందజేశారు. వలిగొండ మండల వ్యాప్తంగా ఎంపీపీ నూతి రమే్‌షరాజు విజ్ఞప్తి మేరకు 1,600లీటర్ల హైపో క్లోరైడ్‌ను  దివీస్‌ సంస్థ డీజీఎం పెండ్యాల సుధాకర్‌, అధికారి కిషోర్‌కుమార్‌ అందజేశారు. 

Updated Date - 2020-04-04T09:57:16+05:30 IST