కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-17T05:42:54+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆదివారానికి ఐదో రోజుకు చేరింది. పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా మహమ్మా రి విజృంభిస్తుండటంతో ప్రజలు స్వీయ రక్షణతోపాటు లాక్‌డౌన్‌కు సహకారం అందిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో పది గంటల వరకు పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో రద్దీ ఉంటోంది.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌
వాహనదారులను అడ్డుకుంటున్న పోలీసులు

వారాంతం కావడంతో మాసం దుకాణాల వద్ద రద్దీ

10గంటల తర్వాత నిర్మానుష్యం


యాదాద్రి, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆదివారానికి ఐదో రోజుకు చేరింది. పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా మహమ్మా రి విజృంభిస్తుండటంతో ప్రజలు స్వీయ రక్షణతోపాటు లాక్‌డౌన్‌కు సహకారం అందిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో పది గంటల వరకు పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో రద్దీ ఉంటోంది. ఆ తర్వాత అవసరం ఉంటే తప్ప ఎక్కువ శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక తొలి ఆదివారం కావడంతో మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. లాక్‌డౌన్‌కు కేవలం 4గంటలు మాత్రమే సడలింపు ఉండటంతో మాసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతోపాటు పరిశ్రమల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

Updated Date - 2021-05-17T05:42:54+05:30 IST