కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌

ABN , First Publish Date - 2021-02-25T05:42:12+05:30 IST

జేఈఈ మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు రెం డోరోజు బుధవారం ప్రశాంతంగా జరిగా యి.

కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్‌
విద్యార్థుల శానిటైజేషన్ స్తున్న సిబ్బంది

 ఆరు కేంద్రాల్లో పరీక్షలు  

 హాజరైన 1,803 మంది విద్యార్థులు

తిమ్మాపూర్‌, ఫిబ్ర వరి 24: జేఈఈ మెయిన్స్‌ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు రెం డోరోజు బుధవారం ప్రశాంతంగా జరిగా యి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  తిమ్మా పూర్‌ మండల కేం ద్రంలోని వాగేశ్వరి కళాశాలలోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కళాశాల, శ్రీ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళాశాల, కరీంనగర్‌లోని విట్స్‌, హుజూరాబాద్‌లోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మొత్తం ఆరు కేంద్రాలలో పరీక్ష లు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్‌లో 976 మందికి 930 మంది హాజరు కాగా 46 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 900 మంది విద్యార్ధులకు 930 మంది విద్యార్ధులు హాజరు కాగా 46 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యాయి. మొత్తంగా ఆరు పరీక్ష కేంద్రాలలో 1,876 మందికి 1,803 మంది పరీక్ష రాయగా 73 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు శానిటైజేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు. 

Updated Date - 2021-02-25T05:42:12+05:30 IST