ఏపీడీపై కొనసాగుతున్న విచారణ
ABN , First Publish Date - 2021-02-26T04:20:40+05:30 IST
జిల్లాలోని వెలుగు శాఖలో గతంలో విధులు నిర్వహించి, ప్రస్తుతం విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఏపీడీ మురళీపై విచారణ జరుపుతున్నామని డీఆర్డీఏ, వెలుగు పీడీ కె.సుబ్బారావు చెప్పారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి 25 : జిల్లాలోని వెలుగు శాఖలో గతంలో విధులు నిర్వహించి, ప్రస్తుతం విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఏపీడీ మురళీపై విచారణ జరుపుతున్నామని డీఆర్డీఏ, వెలుగు పీడీ కె.సుబ్బారావు చెప్పారు. గురువారం ఆయన చాంబర్లో మాట్లాడుతూ... గతంలో ఆయన ఇక్కడ ఏపీడీగా పని చేసిన సమయంలో స్త్రీనిధి, వీవోఏలకు ఇచ్చే జీతాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింక్జీల్లో అక్రమాలకు పాల్ప డినట్లు ఇద్దరు వీవోఏలు వెలుగు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు పింఛన్ డిపార్ట్ మెంట్లో ఏపీడీగా పనిచేస్తున్న ప్రసాద్ను విచారణాఽ దికారిగా నియమించినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారదర్శకంగా విచారణ జరుపుతున్నా మని, ఆరోపణలు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసు కుంటామని పీడీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలులో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.