కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
బొంరాస్‌పేట్‌: దుద్యాల్‌లో వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శన

దోమ, ఆగస్టు 12 : మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి గ్రామంలో శుక్రవారం బీజేపీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలన్నారు. కృష్టారెడ్డి, శ్రీనివాస్‌, వెంకట్‌రాములు, గోపాల్‌, సాయిలు, అనంతయ్య, రాములు తదితరులున్నారు.

  • బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా బైక్‌ ర్యాలీ

తాండూరు, ఆగస్టు 12 : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రధాన వికారాబాద్‌ జిల్లా కార్యదర్శి యు.రమేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని ఆధ్వర్యంలో యావత్‌ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్‌, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, యాలాల మండల ఇన్‌చార్జి రమ్యానాయక్‌, కౌన్సిలర్‌ బాలప్ప పాల్గొన్నారు.

వజ్రోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు

తాండూరు రూరల్‌/యాలాల/బొంరాస్‌పేట్‌, ఆగస్టు 12 : 75ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని యాలాల మండలం దేవనూరు, అగ్గనూరు, బెన్నూరు, యాలాలలో పలు క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఆశన్న, సర్పంచ్‌ శివక ుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌బాబా, ఎస్‌ఐ అరవింద్‌, ఎంపీటీసీ లక్ష్మయ్య తదితరులు క్రీడా పోటీలను ప్రారంభించారు. అదేవిధంగా బొంరాస్‌పేట్‌ మండలం దుద్యాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బొంరాస్‌పేట్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించారు. దుద్యాల్‌ పాఠశాల విద్యార్థులు 75 ఆకారంలో కూర్చొని ప్రదర్శన నిర్వహించారు. 

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST