పునాదుల్లోనే పక్కా గృహాలు

ABN , First Publish Date - 2020-09-25T11:32:24+05:30 IST

దర్శి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిద దశల్లో నిర్మాణాల్లో ఉన్న పక్కా గృహలు మధ్యలో నిలచిపోయాయి. బి

పునాదుల్లోనే పక్కా గృహాలు

 రెండేళ్లుగా నిలిచిపోయిననిర్మాణాలు

 అందని పెండింగ్‌ బిల్లులు 

 లబ్ధిదారుల అవస్థలు


దర్శి, సెప్టెంబరు 24: దర్శి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిద దశల్లో నిర్మాణాల్లో ఉన్న పక్కా గృహలు మధ్యలో నిలచిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. 2016 నుండి 2019 వరకు దర్శి నియోజ కవర్గంలో మొత్తం 5690 గృహలు మంజూరయ్యాయి. వీటిలో 3266 గృహల నిర్మాణం పూర్తి చేశారు. 505 గృహల నిర్మాణం వివిద దశల్లో నిలచిపోయింది. 1919 గృహల నిర్మాణం పునాదుల్లోనే ఉంది.


నిరుపేదలు సొంత ఖర్చులతో పునాదులు వేసుకొన్నారు. ఆ తరువాత బిల్లులు మంజూరు కాకపోవడంతో అలాగే మిగిలిపోయాయి. కొంతమంది అష్టకష్టాలు పడి కొంతమేరకు నిర్మాణాలు చేసినప్పటికీ వారికి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలో నిలచిపోయాయి. ఉన్న గూడు పడేసి సొంత ఇంటి కల నిజం చేసుకునేందుకు పేదలు పడిన కష్టం వృథా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుత పాలకులు గతంలో మంజూరైన గృహలకు బిల్లులు చెల్లింపుల గురించి పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై గృహ నిర్మాణశాఖ అధికారులను వివరణ కోరగా పెండింగ్‌ బిల్లులు ఇంకా విడుదల కాలేదన్నారు.

Updated Date - 2020-09-25T11:32:24+05:30 IST