ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-10-21T06:24:27+05:30 IST

లంబసింగి-చింతపల్లి రోడ్డులో కొలపరి మలుపువద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి
సంఘటన స్థలంలో మృతిచెందిన జగన్నాథం

మరొకరికి తీవ్రగాయాలు... కేజీహెచ్‌కు తరలింపు


చింతపల్లి, అక్టోబరు 20: లంబసింగి-చింతపల్లి రోడ్డులో కొలపరి మలుపువద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మండలంలోని రింతాడ గ్రామానికి చెందిన సోమల జగన్నాథం(28) అరకులోయలో తన బంధువు ఒకరు మృతిచెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అదే విధంగా యర్రబొమ్మలు గ్రామానికి చెందిన గడుతూరి సత్యనారాయణ చింతపల్లి నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతున్నాడు. కొలపరి మలుపువద్ద రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీకొన్నాయి. దీంతో సోమల జగన్నాథం తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సత్యనారాయణకు కూడా తీవ్రగాయాలు కావడంతో చింతపల్లి సీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కి పంపారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-21T06:24:27+05:30 IST