విద్యాభివృద్ధికి రూ.14.9 లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-05-24T06:07:07+05:30 IST

ఏడిద రోడ్డులోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన మాధవి ఎడిబుల్‌ అయిల్స్‌ అధినేత, యువపారిశ్రామికవేత్త వేగుళ్ల చైతన్యబాబు (సేతు) రూ.14.9 లక్షల విరాళం ప్రకటించారు.

విద్యాభివృద్ధికి రూ.14.9 లక్షల విరాళం
చెక్కు అందజేస్తున్న ఎంపీ బోస్‌, ఎమ్మెల్సీ త్రిమూర్తులు, చైతన్యబాబు

మండపేట, మే 23: ఏడిద రోడ్డులోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన మాధవి ఎడిబుల్‌ అయిల్స్‌ అధినేత, యువపారిశ్రామికవేత్త వేగుళ్ల చైతన్యబాబు (సేతు) రూ.14.9 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణీ, కౌన్సిలర్‌ సరస్వతి, విద్యా కమిటీ కమిటీ చైర్‌పర్సన కోరుకొండ సత్యయేసుమణి, హెచ్‌ఎం సల్మాన్‌రాజు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఈవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:07:07+05:30 IST