ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ
ABN , First Publish Date - 2022-05-18T06:29:13+05:30 IST
ద్విచక్ర వాహనానిన మినీలారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మ రణం చెందాడు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
దొరవారిసత్రం, మే 17 : ద్విచక్ర వాహనానిన మినీలారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మ రణం చెందాడు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దొరవారి సత్రం మండలంలోని ఏకొల్లు గ్రామానికి చెందిన మునస్వామి(57) మునిరత్నయ్య, అన్నదమ్ములు. మునస్వామి బావమరిది శ్రీనివాసులుది నాయుడుపేట మండలం బిరదవాడ. వీరు ముగ్గురూ సూళ్లూరుపేటలో కొయ్యపనిచేసేందుదుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మావిళ్లపాడు వద్ద మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై వెళుతుండగా హైదరాబాద్ నుంచి ఏసీల లోడుతో తమిళనాడులోని కంచికి వెళుతున్న మినిలారీ ఎక్స్కవేటర్ను తప్పించబోయి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వెంటనే లారీ అదుపు తప్పి జాతీయ రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మునస్వామి(57) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆయన తమ్ముడు మునిరత్నయ్య, మృతుని బావమరిది శ్రీనివాసులుతో పాటు లారీ డ్రైవర్, క్లీనర్లు సురేష్, స్వీయమ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు 108, హైవే అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించారు. వీరిలో శ్రీనివాసులు, లారీ డ్రైవర్ సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా మునస్వామి మృతదేహానికి సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ అజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏకొల్లులో విషాదం :
మునస్వామి స్వగ్రామం ఏకొల్లులో విషాదం నెలకొంది. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా వారిలో కుమార్తె భర్తను కోల్పోయి ఆయనపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది.