గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-02-26T05:19:46+05:30 IST

మండలంలోని జాతీయ రహదారి బూరుగుపెల్లి గ్రామశివారులో గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
కుంచాల తిరుపాల్‌ మృతదేహం

మామడ, ఫిబ్రవరి 25 : మండలంలోని జాతీయ రహదారి బూరుగుపెల్లి గ్రామశివారులో గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మామడ ఎస్సై వినయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌ పట్టణ కేంద్రంలో గల బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన కుంచాల తిరుపాల్‌(56) మేస్ర్తి పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే పని నిమిత్తం మామడ మండలంలోని గాయద్‌పెల్లి గ్రామానికి ఉదయం మోటార్‌సైకిల్‌పై వెళ్లి, మళ్లీ నిర్మల్‌కు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో వాహనం కింద పడి రెండుకాళ్లు విరిగిపోయి, అక్కడి కక్కడే మరణించాడు. సంఘటన స్థలానికి ఎస్సై వినయ్‌కుమార్‌ చేరుకొని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. 


Updated Date - 2021-02-26T05:19:46+05:30 IST