బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-24T08:43:04+05:30 IST

మండలంలోని బి. పప్పూరు గ్రామం వద్ద బుధవారం ద్విచక్రవాహనా లు ఢీకొని లక్ష్మీదేవి (55) అక్కడికక్కడే మృతిచెందింది. బండ్లపల్లికి చెందిన పెద్దన్న,

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

నార్పల, సెప్టెంబరు 23: మండలంలోని బి. పప్పూరు గ్రామం వద్ద బుధవారం ద్విచక్రవాహనా లు ఢీకొని లక్ష్మీదేవి (55) అక్కడికక్కడే మృతిచెందింది. బండ్లపల్లికి చెందిన పెద్దన్న, బాలపెద్ద, లక్ష్మీదేవి స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో దిగుమర్రి గ్రామానికెళ్లారు. పనులు ముగించుకుని, తిరిగి వ స్తుండగా పప్పూరుకు బైక్‌పై వస్తున్న సంజీవప్ప అతివేగంతో ఢీకొట్టాడు.


దీంతో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న లక్ష్మీదేవి తలకు తీవ్రమైన దెబ్బలు తగిలి, అక్కడికక్కడే చనిపోయింది. పెద్దన్న, బాలపెద్దకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ ప్రమాద స్థలానికి చేరుకుని, లక్ష్మీదేవి మృతదేహానికి నివాళులర్పించారు.


గాయపడిన వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యమందించాలని అక్కడున్న డాక్టర్లను కోరారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-24T08:43:04+05:30 IST