సిద్దిపేట పట్టణంలో ఒకరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-06T11:45:44+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

సిద్దిపేట పట్టణంలో ఒకరికి పాజిటివ్‌

సిద్దిపేట, జూలై 5: సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబసభ్యులు నలుగురి నుంచి అధికారులు నమూనాలు సేకరించగా ముగ్గురికి కరోనా వచ్చినట్లు ఇదివరకే అధికారులు వెల్లడించారు. దీంతో అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి కూడా ఆదివారం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం 14 రిపోర్టులు రాగా ఒక్కరికే వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. మరో 23 రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు. జిల్లాలో ఆదివారం నమోదైన కేసుతో మొత్తం కేసుల సంఖ్య 64కు చేరింది. అందులో 31 మందికి వ్యాధి తగ్గి డిశ్చార్జి కాగా 33 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం రెండు శాంపిల్స్‌ను సేకరించారు. 

Updated Date - 2020-07-06T11:45:44+05:30 IST