రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-29T06:33:52+05:30 IST

నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ గ్రామ జాతీ య రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఒక మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మృతుడు ప్రతాప్‌సింగ్‌

నిర్మల్‌ రూరల్‌, నవంబరు 28 : నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ గ్రామ జాతీ య రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఒక మృతి చెందారు. వివరాలకు వెళితే హైద రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం జిల్లా పోలీసు కార్యాలయం నుండి పోలీస్‌ సిబ్బందితో ఆర్టీసీ బస్సు (టీఎస్‌ 18 జెడ్‌ 0022) బయలుదేరింది. కేఎన్‌ఆర్‌ కన్వెన్షన్‌లో పని చేస్తున్న నేరడిగొండ మండలం కిప్టాపూర్‌ గ్రామానికి చెందిన ప్రతాప్‌సింగ్‌ అనే వ్యక్తి ఇతర వాహనం నుండి దిగాడు. రోడ్డు దాటే క్రమంలో అటుగా వస్తున్న బస్సువేగంగా ఢీకొట్టడంతో అక్కడి కక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-29T06:33:52+05:30 IST