Bandi sanjay padayatra: 9వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-21T18:15:29+05:30 IST

నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరింది.

Bandi sanjay padayatra: 9వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్: నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP state president) బండి సంజయ్ (Bandi sanjay) చేపట్టిన పాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరింది. బుధవారం ఉదయం నాగోల్‌ నుంచి బండి సంజయ్ (BJP Leader) పాదయాత్ర మొదలైంది. నాగోల్ నుంచి కొత్తపేట కన్యకా పరమేశ్వరీ టెంపుల్, బాబా కాంప్లెక్స్, చైతన్యపురి,  వివేకానంద నగర్ బస్సు స్టాప్, పీ&టీ కాలనీ, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం, కర్మాన్‌ఘాట్ క్రాస్ రోడ్స్, బైరామల్ గూడా క్రాస్ రోడ్స్, వెంకటరమణ కాలనీ, ఎఫ్సీఐ కాలనీ ఫేస్ - 1, టీవీ కాలనీ బస్సు స్టాప్, ఎన్జీవోస్ కాలనీ వాటర్ ట్యాంక్, వనస్థలిపురం షాపింగ్ కాంప్లెక్స్, గురుద్వార రోడ్, హుడా సాయి నగర్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు రాత్రి ఆటోనగర్ సమీపంలో బీజేపీ రాష్ట్ర అధినేత(BJP) బస చేయనున్నారు. ఈరోజు మొత్తం 13.5 కిలోమీటర్ల మేర బండి సంజయ్ (BJP Leader) పాదయాత్ర కొనసాగనుంది. 


Updated Date - 2022-09-21T18:15:29+05:30 IST