భారత్‌లో 3071కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2022-01-08T17:59:25+05:30 IST

భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3071కి చేరుకున్నాయి.

భారత్‌లో 3071కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3071కి చేరుకున్నాయి. 1203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, హర్యానా, ఒడిశా ఉన్నాయి. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 513, కర్ణాటక 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్ 204, తెలంగాణ 123, తమిళనాడు 121, హర్యానా 114, ఒడిశా 60, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-01-08T17:59:25+05:30 IST