ఒమైక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

ABN , First Publish Date - 2021-12-26T03:24:19+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతోందని...

ఒమైక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతోందని మోదీ పేర్కొన్నారు. ఒమైక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ఒమైక్రాన్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రాష్ట ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. 


‘‘దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల బెడ్లు ఉన్నాయి. చిన్నారుల కోసం 90వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. దేశంలో మందులకు ఎలాంటి కొరత లేదు. ఆస్పత్రుల్లో 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచాం. ఒమైక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు. దేశంలో గత జనవరి 26 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశంలో అర్హులైన 61శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో మన దేశం ముందుంది. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తాం. 15-18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్. 60 ఏళ్లు పైబడినవారికి, ఫ్రంట్ లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇస్తాం. డీఎన్ఏ వ్యాక్సిన్, పిల్లల కొవిడ్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.’’ అని మోదీ తెలిపారు. 


Updated Date - 2021-12-26T03:24:19+05:30 IST