అనాధ వృద్ధురాలికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-17T04:42:28+05:30 IST

ఎక్కడ పుట్టిందో ఏమో.. నా అన్న వారు ఉన్నారో లేదో తెలియదు.. కావలి రూరల్‌ మండలం గౌరవరంలో యాచ కురాలిగా జీవనం సాగిస్తూ

అనాధ వృద్ధురాలికి అంత్యక్రియలు

కావలి రూరల్‌, మే 16: ఎక్కడ పుట్టిందో ఏమో.. నా అన్న వారు ఉన్నారో లేదో తెలియదు.. కావలి రూరల్‌ మండలం గౌరవరంలో యాచ కురాలిగా జీవనం సాగిస్తూ అనారోగ్యంతో వృద్ధురాలు ప్రాణం విడిచింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించి మానవ తను చాటుకున్నారు పంచాయ తీ కార్యదర్శి ఇ.రవిచంద్ర, గ్రామస్థులు. నాలుగు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆ మతిస్థిమితం లేని వృద్ధురాలు(75) వడ్డిపాళెం మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద యాచన చేసేది. ప్రతిరోజు చుట్టుపక్కల వారు అందించే ఆహారంతో పొట్టనింపుకుని ఆలయం సమీపంలో నిద్రించేది. ఎప్పటిలాగే శనివారం రాత్రి నిద్రించిన యాచకురాలు ఆదివారం ఉద యం లేవకపోవటంతో స్థానికులు  మృతిచెందినట్లు గుర్తించి పంచాయతీ కార్యదర్శి రవిచంద్రకు సమాచారం అందజేశారు. దీంతో ఆయన రూరల్‌ ఎస్‌ఐ మాల్యాద్రి, సర్పంచు దేవరపల్లి రాధికకు సమాచారం అందజేశారు. పోలీసులు, గ్రామస్థుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేంద్ర, శ్రీధర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, వార్డు మెంబర్‌ శుభశ్చంద్ర, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T04:42:28+05:30 IST