అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-11T05:42:11+05:30 IST
పట్టణంలోని పినపాడుకు చెందిన గడ్డం వీర రాఘవయ్య(70) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీటౌన్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు.
తెనాలి రూరల్ మే 10: పట్టణంలోని పినపాడుకు చెందిన గడ్డం వీర రాఘవయ్య(70) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీటౌన్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. గత కొంత కాలంగా రాఘవయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుమందు తాగి ఆపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు తెనాలి జిల్లా ప్రభుత్వవైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.