అధికారులు రాక మండల సర్వసభ్య సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2021-02-23T05:29:10+05:30 IST
మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధి కారు లు గైర్హాజరు కావడంపై మండల ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టేక్మాల్ ఫిబ్రవరి 22 : మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధి కారు లు గైర్హాజరు కావడంపై మండల ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ చింత స్వప్న అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభకు మండల స్థాయి అధికారులు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లోని సమస్యలను గాలికొదిలేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులపై కలెక్టరుకు ఫిర్యాదు చేసిన తర్వాతనే మళ్లీ సభ నిర్వహిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు యూసుఫ్, జడ్పీటీసీ సరోజ, వైస్ ఎంపీపీ మంజుల, మండల కో-ఆప్షన్ సభ్యులు మజార్, ఎంపీటీసీలు నిమ్మ వాణి, రాంబాయి, హన్మంతు, లచ్చమ్మ, అంజయ్య, మోహన్, సర్పంచులు, సుప్రజా, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.