పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ABN , First Publish Date - 2022-01-20T03:34:02+05:30 IST
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని కావలి సబ్యూనిట్ మలేరియా నియంత్రణ అధికారి రమేష్బాబు పేర్కొన్నారు.
కొత్తపల్లిలో లార్వా సర్వేని పరిశీలించిన అధికారులు
కావలి రూరల్, జనవరి 19: పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని కావలి సబ్యూనిట్ మలేరియా నియంత్రణ అధికారి రమేష్బాబు పేర్కొన్నారు. కావలి మండలం కొత్తపల్లిలో మూడు రోజులుగా జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం ఈవోపీఆర్డీ ఆదినారాయణతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందరంగా వారు మాట్లాడుతూ నివాస పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు చిమ్మిలి శ్రీహరినాయుడు, పంచాయతీ కార్యదర్శి రాజేష్, హైల్త్ సూపర్వైజర్ శాంతకుమారి, ఏఎన్ఎం నాగమణి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాఘవ, సవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.