అధికారులు హాజరు కావాలి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-06-05T10:25:31+05:30 IST
వచ్చే సర్వసభ్య సమావేశానికి డివిజన్ స్థాయి అధి కారులందరూ తప్పక హాజరు కావాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
పెంట్లవెల్లి, జూన్ 4: వచ్చే సర్వసభ్య సమావేశానికి డివిజన్ స్థాయి అధి కారులందరూ తప్పక హాజరు కావాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స ర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శా ఖల అధికారులు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. అంతకుముందు మల్లేశ్వరం సర్పంచ్ తిరుపాటి నాగరాజు, ఎంపీటీసీ ఈశ్వ రికుమారి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఎంపీపీ ఉమామహేశ్వరి హామీ ఇవ్వడంతో వారు నిరస నను విరమించారు. జడ్పీటీసీ చిట్టెమ్మ, మార్కెట్ చైర్మన్ నరేందర్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మతిన్ అహ్మద్, ఎంపీడీవో గంగామోహన్ పాల్గొన్నారు.