జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. 23 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-03-12T21:51:40+05:30 IST

జనంపైకి ఎమ్మెల్యే కారు దూసుకెళ్లిన ఘటనలో 23 మంది గాయపడిన ఘటన ఒడిశాలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం... ఒడిశాలోని బానాపూర్ పరిధిలో ఒక ఎన్నిక జరుగుతోంది.

జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. 23 మందికి గాయాలు

భువనేశ్వర్: జనంపైకి ఎమ్మెల్యే కారు దూసుకెళ్లడంతో 23 మంది గాయపడిన ఘటన ఒడిశాలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం... ఒడిశాలోని బానాపూర్ పరిధిలో ఒక ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా ఆఫీస్ బయట ఉన్న ప్రజలు, పోలీసులపైకి బీజేడీకి చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ జాదవ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. మరోవైపు అక్కడే ఉన్న స్థానికులు ఆగ్రహంతో ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారు. వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు, ఎమ్మెల్యేపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయాలపాలైన ఎమ్మెల్యేను ముందుగా దగ్గర్లో ఉన్న తాంగి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, తర్వాత మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. గాయాలపాలైన మిగతావారిని కూడా భువనేశ్వర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-03-12T21:51:40+05:30 IST