ఆక్రమిత భూములు స్వాధీనం
ABN , First Publish Date - 2021-04-17T05:01:23+05:30 IST
మండలంలో చెరువులు.. పంట కాలువలు.. ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఈ నెల 15న కథనం రావడంతో అధికారులు స్పందించారు.
చిట్వేలి, ఏప్రిల్ 16 : మండలంలో చెరువులు.. పంట కాలువలు.. ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడిందనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఈ నెల 15న కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి తన సిబ్బందితో ఆక్రమణకు గురైన ఎల్లమరాజుచెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు ను ఏర్పాటు చేశారు. అలాగే రాపూరు-చిట్వేలి ప్రధాన రహదారి తిమ్మాయపాలెం క్రాస్ శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమం వద్ద ప్రభుత్వ స్థలంలో క్షుద్ర పూజలు చేస్తున్న పూరి గుడిసెను తొలగించి, ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.