అంబాపురం చెరువు ఆక్రమణ
ABN , First Publish Date - 2020-08-10T10:47:16+05:30 IST
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి స్వగ్రామంలోనే చెరువు ఆక్రమణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకటిన్నర ఎకరా చదును, నిర్మాణం
మంత్రి అనిల్ స్వగ్రామంలో కబ్జా
నెల్లూరు (రూరల్), ఆగస్టు 9 : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి స్వగ్రామంలోనే చెరువు ఆక్రమణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ ప్రాంతంలోని అంబాపురం చెరువును కొందరు కబ్జా చేశారు. కొత్తూరు సెంటరు నుంచి అంబాపురం వైపు వెళ్లు రహదారి వెంబడి కనుపూరు కాలువ బ్రాంచి కెనాల్ ఆనుకుని చెరువు ప్రాంతంలో సుమారు ఒకటిన్నర ఎకరా భూమిని చదును చేసి అందులో ఒక గదిని కూడా నిర్మించారు. దానికి వేసిన రంగుల ఆధారంగా చూస్తే ఆలయం పేరిట ఈ కబ్జా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణకు గురైన భూమి విలువ రూ. కోటి వరకు ఉంటుందని అంచనా. అధికారులు ఈ ఆక్రమణను అడ్డుకుని చెరువు భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.