సీసీ రోడ్డు పనుల పరిశీలన
ABN , First Publish Date - 2020-10-02T09:15:07+05:30 IST
పట్టణంలోని 25వ వార్డులోని గాంధీనగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ..
మండపేట, అక్టోబరు 1 : పట్టణంలోని 25వ వార్డులోని గాంధీనగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రుశ్రీవరప్రకాష్లు పరీశిలించారు. పనుల నాణ్యతా ప్రమాణాలపై ఆయన మున్సిపల్ డీఈఈ శ్రీనివాసప్రసాద్, ఏఈ దుర్గాప్రసాద్లను అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి వర్షానికే చెరువును తలపించేలా ఉండే పాతరోడ్డుస్థానా నూతనంగా రోడ్డు నిర్మించటంవల్ల తమకు ముంపు సమస్య తీరిందని వార్డు వాసులు ఎమ్మెల్యే వేగుళ్ల, మాజీ మున్సిప్ చైర్మన్ ప్రకాష్లను కలిసి అభినందించారు. వేగుళ్ల వెంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వాసా రవికిరణ్, అత్తిలి సత్యనారాయణ, మాజీ కోఅప్షన్ సభ్యుడు జొన్నపల్లి సూర్యారావు, తదితరులు వున్నారు.