కరోనాకు ఊతమిస్తున్న ‘ఊబకాయం’
ABN , First Publish Date - 2020-07-26T07:57:21+05:30 IST
ఊబకాయం కలిగినవారు కరోనా బారినపడితే.. ఇబ్బందేనా ? ఈ ప్రశ్నకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వైద్యులు ఔననే సమాధానం చెబుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్తో తమ ఆస్పత్రిలో చేరిన...
లండన్, జూలై 25 : ఊబకాయం కలిగినవారు కరోనా బారినపడితే.. ఇబ్బందేనా ? ఈ ప్రశ్నకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వైద్యులు ఔననే సమాధానం చెబుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్తో తమ ఆస్పత్రిలో చేరిన 1,000 మంది రోగుల్లో దాదాపు 70 శాతం మంది ఊబకాయులేనని స్పష్టం చేశారు. కరోనా చికిత్సపొందుతూ చనిపోయిన రోగుల్లో 82 శాతం మంది కూడా ఊబకాయులేనని తెలిపారు. ఇటీవల అమెరికా, ఫ్రాన్స్, చైనాల్లోనూ ఇదే తరహా వివరాలతో అధ్యయన నివేదికలు వెలువడ్డాయి.