రాజధాని సాధించేవరకు టీడీపీ పోరాటం

ABN , First Publish Date - 2020-10-23T11:12:23+05:30 IST

అమరావతినే రాష్ట్ర రాజధానిగా సాధించే వరకు రైతుల పక్షాన టీడీపీ పోరాడుతుందని ఆపార్టీ ఒంగోలు పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజి ..

రాజధాని సాధించేవరకు టీడీపీ పోరాటం

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 22: అమరావతినే రాష్ట్ర రాజధానిగా సాధించే వరకు రైతుల పక్షాన టీడీపీ పోరాడుతుందని ఆపార్టీ ఒంగోలు పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజి అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. రాష్ట్ర ప్రజల రాజధాని అయిన అమరావతికి శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించే సంకల్పంలో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వగా, ఏడాదికి మూడు పంటలు పండే 32 వేల ఎకరాల ను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరి తంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని నిర్ణయిం చింద న్నారు. ఈవిధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. 310 రోజులుగా రైతులు రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రికి పట్టకపోవడం దారుణమని నూకసాని ధ్వజమెత్తారు.

Updated Date - 2020-10-23T11:12:23+05:30 IST