ఎస్‌సీల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-02T06:23:04+05:30 IST

సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఎస్సీ ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులు నిర్వీర్య మయ్యాయని ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, అధ్యక్షుడు విస్రం డానియేల్‌ అన్నారు.

ఎస్‌సీల సమస్యలను పరిష్కరించాలి
జేసీకి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్సీ సెల్‌ నాయకులు

ఎస్‌సీల సమస్యలను పరిష్కరించాలి

  ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు

విద్యాధరపురం,జూలై 1: సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఎస్సీ ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులు నిర్వీర్య మయ్యాయని ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, అధ్యక్షుడు విస్రం డానియేల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎస్సీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు, అనంతరం జేసీ  మోహనకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా వారిద్దరు మాట్లాడుతూ, చంద్రబాబు దళితులకు చేసిన మంచి పనులను, స్కీములను వివరిస్తూ, వాటినన్నిటినీ జగన్మోహనరెడ్డి నిర్వీర్యం చేశాడన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ నిధులను మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లకు కేటాయించాలన్నారు. లేకుంటే జగన్మోహనరెడ్డికి దళితులే చరమగీతం పాడతారన్నారు. మందా మురళి, బొద్దుకుల్ల ప్రేమరాజు, పరిశపోగు రాజేష్‌, సిరంశెట్టి నాగేంద్ర, ఎం ఎలియాబాబు, వనపట్ల డేవిడ్‌రాజు, కె. విక్టోరియా, కొట్టేటి సరిత, ఎం. రాజు, దోమకొండ రవికుమార్‌, కొత్తపల్లి  ప్రకాష్‌, దేవరపల్లి ఆంజనేయులు, మారంపూడి కుమార్‌, సిరికొండ ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:23:04+05:30 IST