ఆరుగురు తబ్లీగీ జమాత్ సభ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసిన యూపీ సర్కార్

ABN , First Publish Date - 2020-04-03T20:49:02+05:30 IST

ఆసుపత్రి నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. నర్సులతో అ

ఆరుగురు తబ్లీగీ జమాత్ సభ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసిన యూపీ సర్కార్

లక్నో : ఆసుపత్రి నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లీగీ జమాత్ సభ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద శుక్రవారం కేసులు నమోదు చేశారు. వారందరూ మానత్వానికి శత్రువులంటూ యోగి ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘ వారు చట్టానికి బద్ధులు కాలేదు. వారు మానత్వానికి వ్యతిరేకులు కాబట్టే చట్టాన్ని గౌరవించరు. మహిళా నర్సులతో వారు ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరం. వారందరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని సహించం’’ అని యోగి స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-03T20:49:02+05:30 IST