మట్టపల్లిలో నృసింహుని కల్యాణం
ABN , First Publish Date - 2022-08-14T05:15:36+05:30 IST
మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
మఠంపల్లి, ఆగస్టు 13: మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యపూజలతో పాటు కల్యాణోత్సవాన్ని న్నుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణమాసం వరుస సెలవులు రావడంతో భక్తుల రాక పెరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.