ఎన్నారై వైద్యశాల నుండి 50 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-05-18T16:05:29+05:30 IST
మంగళగిరి మండలం చినకాకాని..
మంగళగిరి: మంగళగిరి మండలం చినకాకాని ఎన్నారై వైద్యశాల నుండి సోమవారం 50 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల క్రితం కోవిడ్ బాధితులు, డిశ్చార్జి అయ్యేవారి కంటే చికిత్స కోసం చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గడం, ఊరట కలిగే విషయం. తాజాగా గత 24 గంటలలో 50 మంది డిశ్చార్జి కాగా, 22 మంది మాత్రమే చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కాగా హాస్పటల్లో వసతి ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా గురించి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో సోమవారం కేవలం 17 కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్యులు డాక్టర్ వెంకటరావు తెలిపారు.