యంత్రాలతో పనులపై విచారించి చర్యలు

ABN , First Publish Date - 2021-05-17T04:45:30+05:30 IST

మండలంలోని దొరువుపాడు గ్రామంలో ఉపాఽధి హామీ పనులు యంత్రాలతో నిర్వహిస్తున్నారని ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై సంబంధిత

యంత్రాలతో పనులపై విచారించి చర్యలు

చేజర్ల, మే 16: మండలంలోని దొరువుపాడు గ్రామంలో ఉపాఽధి హామీ పనులు యంత్రాలతో నిర్వహిస్తున్నారని ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై సంబంధిత ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఏపీవో గణేష్‌ మాట్లాడుతూ గ్రామంలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా ఆ పనులకు సంబంధించిన మస్టర్లను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయకుండా రద్దు చేయనున్నట్లు తెలిపారు. మండలంలో ఎక్కడ కూడా యంత్రాలతో పనులు జరగకుండా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-17T04:45:30+05:30 IST